దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అదే నడిగర్ సంఘం 6వ కార్యవర్గ సమావేశం రీసెంట్ గా జరిగింది.ఈ సమావేశంలో అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ మిగిలిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సంఘానికి సంబందించిన అంశాల గురించి ఈ మీటింగ్ లో చర్చించారు.ఇక ఈ కార్యక్రమంలో రీసెంట్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న నెటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం సత్కరించింది.
ఇక ఇదే కార్యక్రమంలో కార్తీ నటించిన విరుమాన్ సినిమా నిర్మించిన సూర్య, హీరో కార్తీ సహ నిర్మాత రాజశేఖర్ కు నడిగర్ సంఘం భవన నిర్మాణానికి పాతిక లక్షలను విరాళం ఇచ్చారు.
సూర్య, కార్తీ ప్రతి విషయంలో ముందుంటారు.
నడిగర్ సంఘం భవనానికి వారి వంతుగా కొంత విరాళాన్ని అందించారు.వీరి దారిలోనే మిగతా హీరోలు కూడా భవన నిర్మాణానికి డొనేషన్స్ ఇస్తారని చెప్పొచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే సూర్య తన సినిమాలతో సత్తా చాటుతుండగా కార్తీ కూడా తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన కార్తీ విరుమాన్ సినిమా అక్కడ ప్రేక్షకులను అలరించింది.
పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కార్తీ ఖాతాలో మరో హిట్ పడ్డది.







