ఏపీలో పెను దుమారం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ కాదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది.ఈ మేరకు అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప కీలక ప్రకటన చేశారు.
ఈ వీడియో అనేక సార్లు షేర్ అవ్వడం వలన.ఆ వీడియో అసలైందా.? కాదా అనే విషయాన్ని తేల్చడం కష్టంగా మారిందని తెలిపారు.
ఎంపీ గోరంట్లకు చెందినదిగా ఉన్న వీడియో ఇంగ్లండ్ లో రిజిష్టర్ అయిన నెంబర్ నుంచి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయినట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు.
ముందుగా ఐటీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లో షేర్ అయ్యిందని తెలిపారు.ఈ వీడియోపై ఎంపీ గోరంట్ల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు.
అనంతరం వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.దీనిపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు.ఒరిజనల్ వీడియో దొరికేంత వరకు ఏం చెప్పలేమని ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు.







