టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందంతో రోజురోజుకీ ఫ్యాన్స్ ఫాలో ఇన్ని పెంచుకుంటున్నారు.
కాగా నేడు మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.నేడు మహేష్ బాబు తన 47 వ ఏట అడుగుపెడుతున్నారు.
దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు పేరును ట్రెండింగ్ చేస్తూ మహేష్ బాబుకు పెద్ద పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
కాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.ఇప్పటికీ కూడా అమ్మాయిల కలలో రాకుమారుడిగా రాణిస్తూ అదే అందంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నాడు.
ఇది ఇలా ఉంటే మహేష్ బాబుకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.అదేమిటంటే మహేష్ కి కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ క్లాస్మేట్స్ అట.

కాగా టాలీవుడ్ అప్పట్లో చెన్నైలో ఉండడంతో మన తెలుగు హీరోల నివాసాలు కోలీవుడ్ స్టార్స్ నివాసాలు ఉండే ప్రాంతాల్లో ఉండేవట.అలా కోలీవుడ్ నటీనటులతో సంబంధాలు కలిగి ఉండేవారు.అలా కోలీవుడ్ నటీనటుల పిల్లలు,టాలీవుడ్ నటీనటుల పిల్లలు ఒకే స్కూల్లో చదువుకునేవారు.మరి ఆ కోలీవుడ్ స్టార్స్ మరెవరో కాదు కార్తీ, విజయ్. కార్తీ, విజయ్ ఇద్దరు మహేష్ బాబు క్లాస్మేట్స్ అట.ఈ ముగ్గురు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారట.ఇదే విషయాన్ని ఈ ముగ్గురు హీరోలు పలు సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే.హీరో కార్తీ నటుడు శివ కుమార్ చిన్న కొడుకు కాగా, సూర్య ఆయనకు పెద్ద కుమారుడు.
అయితే చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబాలు కావడంతో ఈ ముగ్గురు ఒకే విద్యాసంస్థలో చదువుకున్నారు.అలాగే మహేష్ తో విజయ్ కి మరొక సంబంధం ఉంది.







