బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ నెపోటిజం అన్న పేరు ఎక్కువగా బాలీవుడ్ లోనే వినిపిస్తూ ఉంటుంది.
అయితే అలాంటిది ఇప్పుడు ఆ నెపోటిజం అన్న పదం దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక నటి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతే కాకుండా ఆ నటి చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.తాజాగా ఆ నటి సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసింది.
సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా.మరి మిగతావాళ్ల సంగతేంటి అంటూ ఆమె ట్వీట్ చేసింది.
అయితే ఆ నటి చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే అది డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి శంకర్ ను ఉద్దేశించి ఆమె ఆ ట్వీట్ చేసింది అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కోలీవుడ్ బంధుప్రీతి (నెపోటిజం) పై తొలిసారి నోరు విప్పిన ఈ నటి ఇటీవలె సినీ ఇండస్ట్రీలి ఎంట్రీ ఇచ్చింది.
అంతేకాకుండా సదరు నటి ఇప్పటివరకు ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది.ఆ నటి పేరు ఆత్మిక.మిసాయి మురుకు అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్ కీ హీరోయిన్ పరిచయమైంది.అయితే ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు మాత్రం తగిన గుర్తింపు దక్కలేదు.
అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆఫర్లు లేవు.
దీంతో ప్రస్తుతం ఈమె అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.ఈ నేపథ్యంలోనే అతిథి శంకర్ కూతురిపై పరోక్షంగా ఆమె ఈ ట్వీట్ చేసినట్లు సమాచారం.
కాగా అదితి శంకర్ ప్రస్తుతం నటించే ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే.అలాగే సింగర్గా కూడా రాణిస్తోంది.ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు అదితి పై కన్ను పడినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరి ఈ ట్వీట్ ఇంకా ఎంతటి వివాదానికి తెర లేపుతుందో చూడాలి మరి.