టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశంలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు.
రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని వ్యాఖ్యనించారు.గతంలో సోనియాగాంధీని తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి భక్తుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సోనియాను బలిదేవత అని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని డీకే అరుణ సూచించారు.