'చికెన్ ' నారాయణ కు అన్నం పెట్టమంటున్న మెగా బ్రదర్

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పుడు ఏదో ఒక అంశంపై వార్తల్లో ఉంటూ ఉంటారు.ఎవరిపైనైనా విమర్శలు చేసేందుకు ఆయన ఏమాత్రం మొహమాట పడరు.

ఇదే క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జయంతి రోజు నిర్వహించిన విగ్రహావిష్కరణ సభకు సూపర్ స్టార్ కృష్ణ ను ఆహ్వానించి ఉండాల్సిందని , అల్లూరి సీతారామరాజు పాత్ర ద్వారా ఆయన గొప్పతనాన్ని కృష్ణ చాటి చెప్పారని,  ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గానే అందరూ భావిస్తూ ఉంటారని,  అటువంటి వ్యక్తిని ఈ సభకు ఆహ్వానించకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభ వేదిక పైకి తీసుకురావడం కరెక్ట్ కాదు అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రస్తావిస్తూ ఆయన ల్యాండ్ మైండ్ వంటి వాడు అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.అయితే నారాయణ యాదాపాలంగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ నారాయణకు పనేమీ లేనట్టుంది.

అందుకే మెగా బ్రదర్స్ పై పడ్డారు అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ఉండగా,  తాజాగా ఈ వ్యవహారం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

Advertisement

కొంతమంది చేసిన తెలుగు తక్కువ వెర్రి వ్యాఖ్యలపై జనసైనికులు , మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి,  కేవలం ఎండు గడ్డి మరియు చెత్తాచెదారం తింటున్నాడంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.మెగా అభిమానులంతా వెళ్లి నారాయణతో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి.

తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు అంటూ నాగబాబు వెటకారం చేశారు.

Advertisement

తాజా వార్తలు