జనవాణి కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

విజయవాడలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలకు సంబంధించి అర్జీలు పవన్ తీసుకుంటున్నారు.

 Pawan Kalyan Serious Comments On Ycp Governament , Pawan Kalyan, Janasena, Ycp G-TeluguStop.com

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులను ఇంకా మైనారిటీల వర్గాలకి అన్యాయం చేయడం జరిగిందని తెలిపారు.వైసీపీని బలంగా నమ్మే వర్గాలకు ఈ రీతిలో అన్యాయం చేయటం దారుణమని, ఏకంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి కొన్ని పథకాలు వైసీపీ ఆపేయడం జరిగిందని పవన్ ఆరోపించారు.

ఇక మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాలు లేకుండా దుల్హన్ పథకం ఆపేయడం జరిగిందని తెలిపారు.ఇదే కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పవన్ కళ్యాణ్ నీ కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా మైనారిటీలను జనసేన పార్టీ ఓటు బ్యాంకుగా చూడదని… రంజాన్ సమయంలో విందులు ఇచ్చి తర్వాత వదిలేయడం అటువంటివి చేయబోమని పవన్ స్పష్టం చేశారు.మైనార్టీలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube