షారుక్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కొత్త పెళ్లి కూతురు!

నయనతార విగ్నేష్ శివన్ ఈనెల 9వ తేదీ మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

వివాహమైన తర్వాత వీరిద్దరూ థాయిలాండ్ హనీమూన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ జంట హనీమూన్ వెకేషన్ ని పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇలా హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే ఈ జంట తిరిగి వారి పనులలో నిమగ్నమయ్యారు.

ఈమె తమిళం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా సందడి చేయనున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఈమె హనీమూన్ నుంచి రాగానే ముంబైకి వెళ్లి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

నయనతార వివాహం తర్వాత సినిమాలు చేయదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇక ఒకవేళ సినిమాలు చేసిన ఈమె కండిషన్లకు ఒప్పుకుంటేనే సినిమాలలో నటిస్తుంది అంటూ ఇన్ని రోజులు వార్తలు షికార్లు చేశాయి.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ తెలుస్తోంది.

ఇక వీరి హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే హఠాత్తుగా షూటింగ్‌ సెట్‌లో ప్రత్యక్షం కావడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.ఇకపోతే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు