నయనతార విగ్నేష్ శివన్ ఈనెల 9వ తేదీ మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
వివాహమైన తర్వాత వీరిద్దరూ థాయిలాండ్ హనీమూన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ జంట హనీమూన్ వెకేషన్ ని పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇలా హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే ఈ జంట తిరిగి వారి పనులలో నిమగ్నమయ్యారు.
ఈమె తమిళం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా సందడి చేయనున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఈమె హనీమూన్ నుంచి రాగానే ముంబైకి వెళ్లి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
నయనతార వివాహం తర్వాత సినిమాలు చేయదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇక ఒకవేళ సినిమాలు చేసిన ఈమె కండిషన్లకు ఒప్పుకుంటేనే సినిమాలలో నటిస్తుంది అంటూ ఇన్ని రోజులు వార్తలు షికార్లు చేశాయి.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ తెలుస్తోంది.
ఇక వీరి హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే హఠాత్తుగా షూటింగ్ సెట్లో ప్రత్యక్షం కావడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.ఇకపోతే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy