యాదాద్రి జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపత్ ను వెంటనే రద్దు చెయ్యాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్,అసెంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తి మాట్లాడుతూ అగ్నిపథ్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే సాయుధ దళాల్లో, ఆర్మీలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజులు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలను గద్ద దించేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్,జిల్లా కార్యదర్శులు శ్రీధర్,వాసు,కిరణ్,మహేందర్,అసంబ్లీ వైస్ ప్రసిడెంట్ కొల్లోరి రాజు,ఆలేరు అసంబ్లీ అధ్యక్షులు నంద రాజు,నవీన్ యాదవ్,సలావుద్దీన్,బాలరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.







