తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో గుమ్మనూరు జయరాం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరుకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపధ్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా ఆశీస్సులు అందించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
అయ్యన్న పాత్రుడు భూమి కబ్జా చేసినందుకు ఆయనకు తగ్గిన గుణం పాఠం జరిగిందన్నారు.