కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గోడకూలి ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.జయమ్మ అనే మహిళ.
డ్రమ్ము శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న పెద్ద గోడ ఒక్కసారిగా ఆమెపై కూలింది.భారీగా వచ్చిన శబ్ధంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.
అంతలోనే తేరుకుని… గోడ శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను బయటకు తీశారు.గాయాలైన ఆమెను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.







