కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 చేసాడు.
రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.
ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.
దీంతో మొన్నటి వరకు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేసింది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.
దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్ల ను అందు కున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా పార్ట్ 3 కూడా ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
పార్ట్ 3 పై అందరి ఫోకస్ పడడంతో ఈ సినిమాలో అవకాశం వస్తే నటించేందుకు బాలీవుడ్ అగ్ర నటీనటులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

చాప్టర్ 2 లో హీరోయిన్ క్యారెక్టర్ ను చంపేయడంతో పార్ట్ 3 కోసం ప్రశాంత్ నీల్ మరో హీరోయిన్ ను వెతకాల్సి ఉంది.దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ కూడా ఉన్నారట.ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కూడా కేజిఎఫ్ 3 విషయంలో కూడా చర్చలు జరుపుతున్నట్టు టాక్.
ఈ సినిమా బాలీవుడ్ లోనే 450 కోట్లు కలెక్ట్ చేసింది.అందుకే ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి.ఇలా భారీ అంచనాలు ఉండడంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ లు సైతం చాప్టర్ 3 లో నటించేందుకు పోటీ పడుతున్నారట.మరి నీల్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.







