బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో గురించి చాలామంది విమర్శలు చేసినా ఈ షోను అభిమానించే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్6 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ నెట్టింట కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్6 కు కూడా నాగార్జున హోస్ట్ గా మెప్పించనున్నారు.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తి చూపకపోవడం, సీనియర్ హీరోలకు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించాలనే ఆసక్తి లేకపోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులకు నాగార్జున మాత్రమే ఆప్షన్ గా మిగిలారు.నాగార్జున హోస్ట్ గా మెప్పిస్తూ ఉండటంతో పాటు ఎలాంటి సమస్య వచ్చినా తన అనుభవంతో సులభంగా ఆ సమస్యను పరిష్కరిస్తూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.

నటి నవ్యాస్వామి, ఆది, చిత్రారాయ్, యాంకర్ ధన్షు, దీపికా పిల్లి, వర్షిణి పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.ఈ సెలబ్రిటీలలో ఎవరెవరు ఫైనల్ అవుతారో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.మరోవైపు బిగ్ బాస్ షోకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షోలలో ఈ షో ఒకటని చెప్పవచ్చు.అయితే వైరల్ అవుతున్న పేర్లలో ఎంతమంది సెలబ్రిటీలు తుది జాబితాలో ఉంటారో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షోకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.బిగ్ బాస్ షో ద్వారా ఈ షో నిర్వాహకులకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.







