బైక్ పల్టీ కొట్టడంతో ఒకరు మృతి,ఒకరి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా:బైక్ అదుపు తప్పి హైవే పక్కన ఉన్న బ్రిడ్జి కింద పడడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిన విషాద ఘటన 65వ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం ఉండ్రుగొండ స్టేజి వద్ద సోమవారం చోటుచేసుకుంది.మృతురాలు సూర్యాపేట పట్టణం హైటెక్ బస్టాండ్ సమీపంలో గల ఇందిరా కాలనీ చెందిన వీరబోయిన నర్సమ్మ(58)భర్త గోపయ్యగా,గాయపడిన వ్యక్తి వీరబోయిన నాగరాజు(22)గా గుర్తించారు.

 One Died When The Bike Overturned And The Other Was In Critical Condition-TeluguStop.com

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన నాగరాజు హుటాహుటిన సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube