స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జులై 4వ తారీఖు ప్రధాని మోడీ భీమవరం రానున్నారు.ఇక అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
బ్రిటిష్ పరిపాలన కాలంలో.తెల్ల దొరల పై విప్లవ యోధుడిగా.
కానీ విని పోరాటం చేసి మన్యం వీరుడుగా అల్లూరి సీతారామరాజు పేరు సంపాదించుకున్నారు.తెల్లదొరలకు చుక్కలు చూపించారు అల్లూరి.
బీకరమైన పోరాట స్పూర్తితో దేశ స్వాతంత్ర కోసం తన ప్రాణాన్నే దారపోశారు.
అంతటి స్వాతంత్ర మహానుభావులు అల్లూరి సీతారామరాజు విశాఖలో పుట్టడం జరిగింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం ఆయన స్వస్థలం.కానీ అల్లూరి సీతారామరాజు పోరాటం చేసింది ఎక్కువగా చింతపల్లి అడవిలో.
మరణించింది కూడా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు.అల్లూరు జీవితం చాలా వరకు విశాఖ జిల్లా తోనే ముడిపడి ఉండటంతో జయంతి ఉత్సవాలు భీమవరంతో పాటు విశాఖలో కూడా నిర్వహించేలా ఏర్పాటు చేయడం జరిగింది.
అందుకనే విశాఖలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్న బోతున్నరట.







