టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం తదుపరి సినిమాలతో బిజీగా బిజీగా ఉన్నారు.
ఆచార్య సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఈ ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఆహాలో ప్రసారమౌతున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇదే విషయాన్ని చిరంజీవి ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో తెలిపారు.కాగా ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శుక్రవారం రానుంది.
అయితే ఆ ఎపిసోడ్ ను అందరూ చూడడం కోసం ముందుగానే వీలుగా ఆహా సబ్ స్క్రీప్షన్ కు 99 కె కుదిర్చాడు అల్లు అరవింద్.అలా సబ్ స్క్రైబ్ చేసుకున్నవారు కొంత కాలం వరకు ఆహాను వాడుకోవచ్చని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.
తాజాగా ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్కు విరాటపర్వం టీమ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
రానా, సాయి పల్లవిలు కూడా స్టేజ్ మీద కనిపిస్తున్నారు.చిరంజీవితో రానా, సాయి పల్లవిలు పోజులిచ్చినట్టు కనిపిస్తోంది.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ చిరంజీవి ఈవెంట్ నుంచి కోపంగా వెళ్లిపోయారట.
అయితే ఈవెంట్ అంతా అయిపోయిన తరువాత ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.అప్పటికే విన్నర్ ఎవరో ప్రకటించేశారని, విజేతకు ట్రోఫీ కూడా అందజేశారని సమాచారం.మొత్తానికి చిరంజీవి ఎందుకోసం అలిగారు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అభిమానులు ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేస్తూ ఉండగా ఇంకొందరు అభిమానులు మాత్రం వారికి తోచిన విధంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.