చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే విజయాలతో క్రేజ్ ను పెంచుకున్న ఉదయ్ కిరణ్ తర్వాత రోజుల్లో వరుస విజయాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.అయితే తర్వాత రోజుల్లో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో పాటు నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చిన నేపథ్యంలో ఉదయ్ కిరణ్ కు క్రేజ్ తగ్గుతూ వచ్చింది.
తర్వాత రోజుల్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
ఉదయ్ కిరణ్ తమతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని దిల్ రమేష్ వెల్లడించారు.
చిత్రం సక్సెస్ తర్వాత ఉదయ్ నటించిన మూవీ నువ్వు నేను అని ఉదయ్ కిరణ్ చనిపోయే సమయానికి కూడా నేను అతనితో క్లోజ్ గా ఉన్నానని ఆయన వెల్లడించారు.శ్రీహరి తాను ఇండస్ట్రీలో సక్సెస్ అవుతానని అయన చెప్పేవారని ఆయన చెప్పుకొచ్చారు.
ఉదయ్ కిరణ్, శ్రీహరి మరణం నన్ను ఎంతగానో బాధ పెట్టిందని దిల్ రమేష్ తెలిపారు.
పెద్ద హీరోలు అంటే చాలా రిజర్వ్డ్ గా ఉంటామని మన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలతో ఫ్రెండ్లీగా ఉండటం సాధ్యమని ఆయన తెలిపారు.
ఉదయ్ కిరణ్ కు తాను హీరో అనే ఫీలింగ్ ఉండేది కాదని అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు.సక్సెస్ అంటే సంతృప్తి ఉండటం అని అంతకుమించి ఏం లేదని ఆయన తెలిపారు.సంతృప్తి లేకపోవడం వల్ల హీరోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
సినిమాలు లేవని సినిమాలో ఆఫర్లు రావడం లేదని బాధ పడితే ఏ మాత్రం ఫలితం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.ఆర్టిస్ట్ గా నేను బాగున్నాను కాబట్టే ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు.ఆర్టిస్ట్ కావాలని భావించే వాళ్లకు గుర్తింపు ముఖ్యమని ఆయన కామెంట్లు చేశారు.ఉదయ్ చిన్న వయస్సులోనే రూ.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అని రూ.కోటి కూడా ఆయన తీసుకున్నాడని అయితే సక్సెస్ స్ట్రెస్ వల్ల ఇబ్బందులు వచ్చాయని ఆయన తెలిపారు.కెరీర్ లో డౌన్ ఫాల్ ను గుర్తు పెట్టుకుని ముందడుగులు వేయాలని ఆయన తెలిపారు.