31 కిలోల అరటి పండ్లు పారబోయడం ఏంటి? అసలు వాళ్లకేమైనా పిచ్చా? అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాలా రిజమే.31 కిలోల అరటిపండ్లను పారబోశారు.అయితే ఎందుకో తెలుసా? అసలు రిజన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేందుకు 31 కిలోల అరటిపండ్లను ప్రదర్శనకు ఉంచారు.
అమెరికాలోని ఒక ప్రాంతంలో స్థానిక సూపర్ మార్కెట్ నిర్వాహకులు గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించేందుకు 31 కిలోల అరటిపండ్లను ధాన్యంలా పోశారు.చికాగోలోని ఫ్రెష్ డెల్ మోంటే.
జువెల్ ఓస్కో అనే స్టోర్ తో కలిసి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.ఈ ప్రదర్శనలో యునైటెడ్ స్టేట్స్లోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని వెస్ట్ మాంట్ లోని ఒక సూపర్ మార్కెట్ ఆవరణలో 31,757 కిలోల అరటిపండ్లను పోశారు.19 రకాల పండ్లను ప్రదర్శనకు ఉంచారు.ఈ ప్రదర్శను చూడటానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు.
ఈ ప్రదర్శనను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.ఇన్ని అరటిపండ్లను ఎలా పోశారంటూ అవాక్కయ్యారు.
చివరికి దీనికి గాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.గిన్నీస్ బుక్ లోకి ఎక్కడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ రికార్డు సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందని, దీని కోసం చాలా శ్రమించామని చెప్పుకొచ్చారు.ప్రదర్శన అనంతరం పండ్లలో కొన్నింటిని స్థానికులకు పంచగా.మిగతావి ఫుడ్ బ్యాంక్ కు డోనేట్ చేశారు.వీటిని ఇలా ప్రదర్శనకు ఉంచడానికి మూడు రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు.గతంలో ఈ రికార్డు బ్రెజిల్ కు చెందిన డి అగ్రికల్చరల్ ఈ కంపెనీ పేరుపై నమోదు అయింది.ఆ కంపెనీలో గతంలో 19 వేల కిలోల అరిటిపండ్లను కుప్పలుగా పోసింది.
ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేశారు.







