సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట వద్ద రోడ్డెక్కిన అన్నదాతలు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట వద్ద అన్నదాతలు రోడ్డెక్కారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Farmers Protest Siddhipeta District Dubbaka Mandal Pothareddy Peta Details, Farm-TeluguStop.com

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే ధర్నా వద్దకు చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు.రైతులతో పాటు సుమారు రెండు గంటల పాటు ధర్నాలో బైఠాయించారు.

పోతరెడ్డిపేట కొనుగోలు కేంద్రంలో రెండు రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్వాహకులు పూర్తిగా జాప్యం వహిస్తున్నారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం లో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.అప్పటి వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు.

సుమారు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు పై వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు సముదాయించిన ఫలితం లేకుండా పోయింది.

రైతులు మాత్రం కొనుగోలు చేసేవరకు ధర్నా ను విరమించేది లేదన్నారు.వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరీష్ ధర్నా ప్రాంతానికి స్థలానికి చేరుకుని రాబోయే ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే జూన్ పది లోపు ధాన్యం కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాం హౌస్ ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.కుంటి సాకులు చెప్పి రెతన్నలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube