బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగానా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు ఆమె కొన్ని విషయాలలో దారుణంగా ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అదేవిధంగా సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది.ఈ విషయంలో ఈమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇకపోతే తనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్స్ గురించి అంతగా పట్టించుకోదు.అలా అని తనపై మితిమీరి కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.
ఇకపోతే ప్రస్తుతం కంగనా రనౌత్ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.తాజాగా ఆమె నటించిన ధాకడ్ సినిమా శుక్రవారం విడుదల అయిన విషయం తేలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.ఈ చిత్రంలో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇకపోతే కంగానా ఆమె నటించిన ధాకడ్ సినిమా విడుదల ముందు రోజు కాస్ట్లీ కారును కొనుగోలు చేసింది.మే బ్యాక్ ఎస్680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన లగ్జరీ కారును కొనుగోలు చేసింది.ఆమె కొన్న ఆ కారు ఇటీవలే ఇండియాలో లాంచ్ అవ్వగా ఈ లగ్జరీ కారు కొన్న మొదటి ఇండియన్గా కూడా కంగనా నిలిచింది.ఈ కారు ధర దాదాపుగా 3.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం కంగనా కొనుగోలు చేసిన ఈ కారు వీడియోలు,ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.