బిస్కెట్లు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా మరియు అత్యధికంగా ఆరగించే స్నాక్స్లో ఇవే ముందు వరసలో ఉంటాయి.
అందుకు తగ్గట్టుగానే పలు కంపెనీలు బిస్కెట్లను రకరకాలుగా తయారు చేసి అందుబాటులోకి తెస్తున్నాయి.అయితే బిస్కెట్లు రుచిగా ఉంటాయి.
కడుపునూ నింపుతాయి.మరి ఆరోగ్య ప్రయోజనాల సంగతేంటి.? అసలు బిస్కెట్లు తినడం హెల్త్కి మంచిదా.? కాదా.? అంటే నిపుణులు కాదనే సమాధానం ఇస్తున్నారు.
బిస్కెట్లు తినడానికి ఎంత రుచిగానే ఉన్నప్పటికీ.
వాటిని అధికంగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.మరి లేటెందుకు బిస్కెట్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఏంటో చూసేయండి.
దాదాపు అన్ని బిస్కెట్లను మైదా పిండి, చెక్కెరతోనే తయారు చేస్తారు.అందు వల్ల, బిస్కెట్లను పరిమితికి మించి తీసుకుంటే.
శరీరంలో కొవ్వులు పెరిగి ఊబకాయులుగా మారిపోతారు.
షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు బిస్కెట్లకు ఉంటుంది.కాబట్టి, బిస్కెట్లను ఎడా పెడా తినేస్తే.మధుమేహం బారిన పడి నానా తిప్పలు పడాల్సి వస్తుంది.
అలాగే బిస్కెట్లను ఓవర్గా తీసుకోవడం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి.
మెదడు పని తీరు మందగించి.జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది.
మరియు కాలేయం ఆరోగ్యంగా కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది.
అందుకే బిస్కెట్లను తీసుకోవడం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.
ఒక వేళ తినాలి అనుకుంటే.మైదా పిండి, చెక్కెర కాకుండా మల్టీ గ్రెయిన్ పిండి లేదా రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాల పిండులతో తయారు చేసే బిస్కెట్లనే ఎంచుకుని తినాలి.
వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.పైగా ఆరోగ్యానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.