యాదాద్రి భువనగిరి జిల్లా:చందుపట్ల గ్రామ సర్పంచ్ చిన్నం పాండుపై సస్పెన్షన్ వేటు పడింది.పంచాయతీ నిధులను పక్కదారి పట్టించి,అవినీతి,అక్రమాలకు పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,డీఎల్పీవో యాదగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమగ్ర విచారణ చేపట్టారు.
నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడంతో సర్పంచ్ పాండుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో సర్పంచ్ సస్పెన్షన్ కు గురైనట్టు డీపీవో సునంద తెలిపారు.
గతంలో గ్రామ పంచాయతీ నిధుల అవినీతి అక్రమాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి విజయశాంతిని కలెక్టర్ సస్పెండ్ చేయడం గమనార్హం.







