కేసీఆర్ కు పోయే కాలం దాపురించింది:ఈటెల

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోయే కాలం దాపురించే నియంతృత్వ పోకడకు పోతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

ఖమ్మం పర్యటనకు వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈటెలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి,సత్కరించారు.

అనంతరం సంకినేని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో వరి వేస్తే ఉరే అని అన్నదాతలను గందరగోళ పరిస్థితులోకి నెట్టి,ఇప్పుడు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే,రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి లాగా ఉండొద్దని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో సరిపడా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి,రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి,పేట పట్టణ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News