కూతుర్లని కార్మికులుగా మార్చేసిన ప్రముఖ యాంకర్... ఫోటోలు వైరల్!

మే ఒకటవ తేదీ కార్మికుల దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభాను కార్మికుల దినోత్సవం సందర్భంగా తన ఇద్దరు చిన్నారులను కార్మికులుగా మార్చేశారు.

 Anchor Udayabhanu Turns Her Daughters Into Workers On May Day Photos Viral Detai-TeluguStop.com

ఈ క్రమంలోనే తన కూతుర్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఒకానొక సమయంలో బుల్లితెరపై, వెండితెర పై ఎన్నో సినిమాలు,బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఉదయభానుకు ఇద్దరు కవల పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే.

ఆ ఇద్దరికీ భూమి ఆరాధ్య, యువి నక్షత్ర అని పేర్లు పెట్టారు.పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచంగా అయిపోయిన ఉదయభాను ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెరపై కూడా సందడి చేయలేదు.

ఇలా తన పిల్లలే తన ప్రపంచమని బతుకుతున్న ఉదయభాను ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే ఆ వేషధారణలో తన కూతుళ్ళను ముస్తాబు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే మే ఒకటో తేదీ కార్మికుల దినోత్సవం కావడంతో తన ఇద్దరు చిన్నారులను కార్మికులుగా మార్చారు.పొలంలో గడ్డిమోపులు మోస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను ఉదయభాను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube