ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ “ఏటీఎమ్”.జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు.దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ “ఏటీఎమ్” వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.థ్రిల్లర్ కథతో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ రూపొందనుంది.
ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా…పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
*నటీనటులు* – వీజే సన్నీ, దివి తదితరులు
.