ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మీరు వినేవుంటారు.ఈ ప్రభుత్వ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే.ఇదే కోవలో వచ్చిన పథకమే.
ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన 2022. ఇది దేశంలోని అసంఘటిత రంగానికి సంబంధించిన వారి భవిష్యత్తును మెరుగుపరుస్తుంది.
ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ అనేది అసంఘటిత కార్మికుల కోసం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం.
మీరు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు వరకు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.దీని కోసం మీ నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన యొక్క ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక అసంఘటిత రంగ కార్మికుడు ఈ ప్రభుత్వ పథకానికి సభ్యత్వం పొంది, 60 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే అతనికి కనీసం నెలకు 3,000 పెన్షన్ లభిస్తుంది.అంటే, ప్రభుత్వం మీకు ఏడాదికి రూ.36,000 ఇస్తుంది.ఇది మాత్రమే కాదు, మరణించిన తర్వాత చందాదారుని జీవిత భాగస్వామికి నెలవారీ కుటుంబ పెన్షన్ లభిస్తుంది.
అటువంటప్పుడు పెన్షన్లో 50 శాతం అందిస్తారు.

కాగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేనివారు కొందరున్నారు.ఈ పథకం కింద, ఏదైనా చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకం (NPS, ESIC, EPFO వంటివి)తో అనుబంధం కలిగిన ఎవరైనా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందలేరు.దీనితో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు.
ఈ పథకం కోసం, ఎన్రోల్మెంట్ సెంటర్లో మీరు ఆధార్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ సెల్ఫ్-సర్టిఫికేట్ ఫారమ్ జరాక్సు కాపీలు అందజేయాలి.ఆటో-డెబిట్ సౌకర్యం కోసం మరొక ఫారమ్ నింపాల్సివుంటుంది.







