వైసీపీకి ఇదే చివరి ఛాన్స్ అంటున్న బీజేపీ నేత..!!

ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 This Is The Last Chance For Ycp Bjp Leader Vishnuvardhan Reddy Sensational Comme-TeluguStop.com

వైసీపీకి ఇదే చివరి ప్రభుత్వ పరిపాలన అని స్పష్టం చేశారు.కర్నూలు జిల్లాలో గత కొంతకాలంగా శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆత్మకూరులో పోలీసులు ఆస్తులు తగలబెట్టడం.హత్యాయత్నం చేయడం.

పోలీసులు జైలుకు పంపడం ఈ రాష్ట్ర ప్రజలు చూశారని మండిపడ్డ్డారు.

ఇక ఇదే సమయంలో నంద్యాలలో మత దురహంకార సంస్థలు ఏకంగా రోడ్డు మీదకు వచ్చి, ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని సంచలన ప్రకటనలు చేశాయి.

మా కనుసన్నల్లోనే వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని ప్రకటించుకున్నాయి.ఇటువంటి వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు.ఇక ఇదే సమయంలో ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా… కర్నూలులో కొన్ని దాడులు జరిగాయి.పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube