రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరొజు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు, అనంతరం యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురంకు స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఈఓకు అందజేశారు.ఈ సందర్భంగా మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.
యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు తన వంతుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం యదాద్రి నరసింహుడి కి మంత్రి పువ్వాడ దంపతులు స్వామి వారికి ఆయా కిలో బంగారంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మంత్రి దంపతులను ఆలయ ఆధికరులు, అర్చకులు శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.







