నంద్యాల.మహిళలకు కవచం లాంటి దిశ యాప్ ప్రతి మహిళ కు భద్రత కల్పించడంలో ఉపాయేగపడుతుందని ఓ ఎస్ఐ వినూత్నంగా తీరునాల లో గుర్రము పై స్వారీ చేస్తూ దిశ యాప్ పై మహిళలకు ప్రచారం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తుర్ తీరునాల లో మిడ్తూర్ ఎస్ఐ మారుతి శంకర్ వినూత్నంగా గుర్రము పై స్వారీ చేస్తూ దిశా యాప్ పై ప్రచారం నిర్వహించారు.
ఎద్దుల బండ లాగు ప్రదేశంలో,రథం పరిసర ప్రాంతాల్లో దిశ యాప్ ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ దిశ యాప్ ఆవశ్యకతను మహిళకు తెలియజేశారు.
మహిళలకు ఈ దిశ యాప్ ఒక రక్షణ కవచం లాంటిదని,ఈ యాప్ ను ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే న్నమహిళలకు రక్షణ కల్పించండం పోలీసులకు సులువు అవుతుంది అని ఎస్ఐ మారుతీ శంకర్ ప్రచారం చేశారు.ఎస్ఐ చేస్తూన్న వినూత్న అవగాహన కార్యక్రమం ను పలువురు అభినందించారు.







