నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. పిస్తా హౌస్ అదిరే ఆఫర్

ముస్లింలకు ఎంత పవిత్రమైన మాసం రంజాన్‌ నెల.ఈ రంజాన్‌ మాసంలో ఎంతో భక్తిశ్రద్దలతో ముస్లిం సోదరులు అల్లాహ్‌ను ప్రార్థిస్తుంటారు.

అయితే రంజాన్‌ వచ్చిదంటే చాలు.పట్టణాల నుంచి గ్రామాల వరకు వివిధ రకాల వంటకాలు దర్శనమిస్తుంటుయి.

ఇది హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పత్తర్‌కా ఘోష్, హలీం లాంటి ఎన్నో అరుదైన వంటకాలను ఈ రంజాన్‌ మాసంలో టేస్ట్‌ చేయవచ్చు.

అయితే రంజాన్‌ నెలలో కేవలం ముస్లింలే కాకుండా మాంసాహార ప్రియులందరూ ఈ వంటకాలను ఆస్వాదిస్తుంటారు.సహర్,ఇఫ్తార్ వేళల్లో భాగ్యనగరంలో ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ రుచికరమైన భోజనాన్ని కూడా రెడీ చేస్తున్నారు.

Advertisement

ఇక చార్మినార్‌లో అయితే.ఉదయం వేళ ముస్లిం సోదరులు చేసే సెహరి వంటకాలకు పిస్తాహౌస్‌ పెట్టింది పేరు.

రంజాన్ సందర్భంగా పిస్తా హౌస్ అదిరే ఆఫర్లను ప్రకటించింది.ఉదయం వేళల్లో సహర్ చేసేందుకు వచ్చేవారి కోసం దాదాపు 15 రకాల నాన్‌వెజ్‌ అన్‌లిమిటెడ్‌ భోజనాన్ని పిస్తా హౌస్ రెడీ చేసింది.

కేవలం 390 రూపాయలతో 15 రకాల మటన్‌ కర్రీస్‌ ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.మటన్‌ కీమ, మటన్‌ కర్రీ, మటన్‌ ఫ్రై, లివర్‌ఫ్రై, బోటి ఫ్రై, బొక్కల సూఫ్‌, కట్టీదాల్ ఇలా 15 రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి.

రంజాన్‌ కావడంతో ఈ ఆఫర్‌ పెట్టామని పిస్తాహౌస్‌ యాజమాని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మాకు సంపాదన ముఖ్యం కాదు… సేవకోసమే రంజాన్‌లో ఈ ఆఫర్‌ పెట్టామని పేర్కొన్నారు.హైదరాబాద్ నలుమూలల నుండి పెద్దసంఖ్యలో నాన్ వెజ్ ప్రియులు పిస్తాహౌస్‌కి తరలివస్తున్నారు.

Advertisement

దీంతో భోజనం తినడానికి గంటలు గంటలు.హోటల్ బయట వేచి చూడాల్సి వస్తోంది.

ఇక పిస్తా హౌస్ హలీమ్ కూడా ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే.ఇక్కడ నుంచి విదేశాలకు సైతం హలీం పార్సిల్ పంపిస్తుంటారు.

ఇక్కడ హలీం కోసం జనాలు బారులు తీరుతున్నారు.

తాజా వార్తలు