బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ వార్త ఏదైనా ఉందా అని అంటే అది అలియా భట్, రణబీర్ కపూర్ వెడ్డింగ్ అనే చెప్పాలి.స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గత కొంత కాలంగా లవ్ ఉన్నారని వార్తలు వస్తున్నా వీరిద్దరూ స్పదించలేదు.
అయితే వీరు పెళ్లి ఏప్రిల్ 14న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.
కపూర్ లకు వారసత్వంగా వస్తున్న వాస్తు లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
వీరి ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు నిన్నటితో తెరపడింది.బాలీవుడ్ ప్రేమ జంట అలియా, రణబీర్ పెళ్లి తో ఒక్కటి అవ్వడంతో ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.
అయితే తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎవ్వరు పెళ్ళికి హాజరు కాకపోవడంతో పెళ్ళికి ఈమె వాళ్ళను పిలవలేదా? లేదంటే పిలిచినా వీరే వెళ్ళలేదా అనే విషయం ప్రెసెంట్ బిటౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈమె ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చెయ్యడంతో ఈ టీమ్ కు ఈమెకు కుదరడం లేదని గొడవల కారణంగానే ఈమె అలా చేసిందని వార్తలు వచ్చాయి.కానీ ఈమె సోషల్ మీడియా ద్వారా అది అబద్ధం అని చెప్పింది.ఇక ఇటీవల ఎన్టీఆర్ 30వ సినిమా నుండి కూడా అలియా తప్పుకుంది.దీంతో ఈమెకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు నిజంగానే చెడిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక ఇప్పుడు ఈ టీమ్ లో ఎవ్వరు పెళ్ళికి హాజరు కాకపోవడంతో టీమ్ ని ఈమె పిలవలేదా లేదంటే వీరే హాజరు కాలేదా అనే సందేహాలు మొదలయ్యాయి.అయితే నిజానికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ స్టార్ ల సందడి కూడా ఈ పెళ్ళిలో కనిపించలేదు.బాలీవుడ్ ఖాన్ ల సందడి కానీ అలియా స్నేహితురాలు అయినా దీపికా కూడా కనీసం కనిపించలేదు.మరి రెసెప్షన్ లో అయినా స్టార్ ల సందడి ఉంటుందో లేదో చూడాలి.







