పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసనగా గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రయాణికులకు ప్రభుత్వ అసమరగద పాలనపై వివరించారు.
ప్రజలపై జగన్ బారాల బాదుడే…బాదుడు కొనసాగుతోందని తుగ్లక్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయామని ఈ సందర్బంగా ఉమామహేశ్వరావు అన్నారు.మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే వుందని.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రజలపై భారాలు మోపుతూనే ఉన్నారని తెలిపారు.చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ బాదుడు బాదేస్తున్నాడని విమర్శించారు.
పెంచిన ధరలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.







