తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.ఇక చిన్న హీరోల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్షన్ ట్రెండ్ నడుస్తోంది అని తెలుస్తోంది.ఏ హీరో ని కదిపిన యాక్షన్ సీక్వెన్స్ తో ఆదరగొట్టేస్తున్నాం.
మీరు తప్పక సినిమా చూడాలి అంటూ సమాధానం చెబుతూ ఉండటం గమనార్హం.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి నాచురల్ స్టార్ నాని వరకు యాక్షన్ మంత్రమే జపిస్తున్నారు .ఈ నేపథ్యంలో రూపొందిన త్రిబుల్ ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకొని ఇక సినిమాలను చేస్తూ ఉన్నారు అన్నది తెలుస్తుంది.
ఇక ఇప్పటికే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది యష్ హీరోగా తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల కాబోతుంది.
ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక జక్కన్న తర్వాత మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ ను మరో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇక త్రిబుల్ ఆర్ ముగియగానే కొరటాల శివ తో 30వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడిపోయాడు ఎన్టీఆర్.ఇక ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది.ఇక త్రిబుల్ ఆర్ సినిమా లో యాక్షన్ చేస్తుండగానే స్టార్ డైరెక్టర్ శంకర్తో సినిమాకు రెడీ అయిన చరణ్ రెబల్ లీడర్ గా కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.
యాక్షన్ ఫ్యాన్స్ అందరికీ మేస్మె్రైజ్ చేయబోతున్నాడట.అంతేకాదు శంకర్ ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండటం చూస్తుంటే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.ఇది చూస్తే యాక్షన్ అంతకుమించి అనే రేంజ్ లోనే ఉండబోతోందని తెలుస్తోంది.







