దేవాలయంలో కి దూసుకువచ్చిన బొలెరో...ఇద్దరు చిన్నారులు మృతి!

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 Three Children Killed In Road Accident In Khammam District-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన భజన బృందం సభ్యులు వారి చిన్నారులతో సహా పాల్గొన్నారు.భజన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అతివేగంతో వచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని డి కొట్టి, ఆంజనేయ స్వామి దేవాలయ గోడ ప్రహరిలోకి దూసుకుపోయింది.

హ సమయంలో ప్రహరీ గోడ పక్కన కూర్చొని ఉన్న తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులపై బొలెరో దూసుకువెళ్లటంతో తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఇద్దరు మృతి చెందారు.

మరి చిన్నారితో పాటు, బొలెరో నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో గాయాల పాలైన వారిని ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం దిద్దుపూడి గ్రామస్తులది గా తెలుస్తుంది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube