ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లోట్.తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణమాజీ టీటీడీ ఈవో ఐవీ సుబ్బారావు., నేవీ చీఫ్ అడ్వైజర్ ఆర్.హరి కుమార్., విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ.శ్రీరామనవమి రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మరింత మెరుగ్గా.ప్రజలకు చేరువగా.
, అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.మంత్రి వర్గ విస్తరణలో మార్పులకు అందరూ ఆమోదం తెలపడం, హిత పరిపాలనను అందించే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారని అన్నారు.
మంత్రి వర్గ విస్తరణ అనంతరం రాష్ట్రము మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.







