ఖమ్మం బస్ సైషన్ లో ఒక వ్యక్తి బస్ దిగుతూ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.ఖమ్మం లో ఓ పని నిమిత్తం కోదాడ నించి ఖమ్మం వచ్చారు భార్య,భర్తలు.
ఖమ్మం బస్టాండుకు చేరుకొన్న తరువాత భర్త రామకృష్ణ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు దిగుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు.పక్కన అతని భార్య లక్ష్మి గమనించి అక్కడే ఉన్న బస్టాండులో విధులు నిర్వహిస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ భరత్,హోంగార్డు మౌలాలి కి తెలుపగా వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు, రామకృష్ణ కాళ్ళు చేతులు,చాతీ పై రుద్ది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.108 కి సమాచారం అందించినా 108 వచ్చేలోగానే అతను మరణించినట్లు దృవీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.