IPL​ ఫ్యాన్స్​ ఇక పండగ చేసుకోండి.. BCCI కీలక నిర్ణయం!

ఉగాది వేళ IPL క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పింది BCCI.అదేమంటే స్టేడియం సీటింగ్‌ సామర్థ్యంలో దాదాపు 50% ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.T20 మెగా టోర్నీలో భాగంగా, ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు BCCI అనుమతించడం విశేషం.అందుకు సంబంధించిన టికెట్లు ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపింది BCCI.

 Ipl​ ఫ్యాన్స్​ ఇక పండగ చేసుకోండ-TeluguStop.com

ఇక BCCI తీసుకున్న ఈ నిర్ణయం వలన మరింత మంది క్రికెట్ అభిమానులు డైరెక్ట్ గా ఈ మ్యాచును చూసే వెసులుబాటు దొరికింది అని ‘బుక్‌ మై షో’ నిర్వాహకులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.T20 మెగా టోర్నీ 15వ సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్నాయి.కరోనా కారణంగా తొలుత 25% మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఇక ప్రస్తుత పరిణామాలతో దానికి డబుల్ కూర్చోవడానికి వెసులుబాటు కల్పించింది బిసిసి.

Telugu Occupancy, Audience, Bcci, Corona, Ipl, Key, Mumbai Indians, Teams, Stadi

ఇక తాజాగా, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.ఈ నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది.మెగా టోర్నీలో భాగంగా ఈరోజు అనగా ఏప్రిల్​ 2, శనివారం 2 మ్యాచ్​లు జరగనున్నాయి.మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయితో తలపడనుంది రాజస్థాన్​ రాయల్స్​.డీవై పాటిల్​ మైదానంలో ఈ మ్యాచ్​ జరగనుంది.ఎంసీఏ వేదికగా రాత్రి 7.30 గంటలకు దిల్లీ, గుజరాత్​ పోటీపడనున్నాయి.వీటిని అభిమానులు ఎంచక్కా చూడగలరని ఈ సందర్భంగా బుక్ మై షో హర్షాన్ని వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube