ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.
వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.
ఆర్ఆర్ఆర్ మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.
ప్రెసెంట్ ఆర్ ఆర్ ఆర్ మ్యానియా దేశమంతటా నడుస్తుంది.
తాజాగా బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తారక్ ఈ సినిమా డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఈయన చేసినా వ్యాఖ్యలు బిటౌన్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ సినిమా కోసమే ఎంత కఠోరంగా శ్రమించారో రాజమౌళి విజన్ అండ్ పర్ఫెక్షన్ గురించి తెలిపారు.
నా కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే ట్రిపుల్ ఆర్ ముందు ఆ తర్వాత అనే చెప్పాలి.భీం వంటి బలవంతమైన పాత్రలో జంతువులతో నా ఎపిసోడ్ గురించి రికార్డ్ చేసిన ఒక వీడియో పై ప్రేక్షకుల స్పందన చూసి మతిపోయింది.

అప్పుడు అనిపించింది రాజమౌళి ఆడియెన్స్ పల్స్ ని ఎలా పట్టేస్తున్నాడా అని.ఒక్కో వర్గానికి ఒక్కో విధమైన అభిరుచి ఉంటుంది.అయితే అలంటి అన్ని వర్గాల ప్రేక్షకులని తన సినిమాలతో ఎంటీటైన్ చేస్తున్నారు.రాజమౌళి ఒక పెర్ఫెక్షనిస్ట్.పులితో ఫైట్ సీన్ చాలా డిటైల్డ్ గా చెప్పాడు.తాను చెప్పిన దాన్ని ఫాలో అవ్వడమే కాకుండా నేను నటుడిగా నా బాధతను నిర్వహించాను అంటూ చెప్పుకొచ్చాడు.








