నరసాపురం వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాజీమంత్రి సీఎం జగన్ బాబాయ్ వైయస్ వివేకా కేసుకు సంబంధించి సీబీఐ కి లెటర్ రాశారు.పరిటాల రవి నిందితులనీ జైల్లో మట్టు పెట్టినట్లు… అటువంటి కొత్త తరహాలోనే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు లో కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.
వైయస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జైల్లో ఉన్న వారికి అదేవిధంగా బయట ఉన్న నిందితులకు సాక్షులకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలని సీబీఐ నీ రఘురామకృష్ణరాజు కోరారు.
హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాదు ఈ కేసుకు సంబంధించి వైసిపి సీనియర్ నాయకుడు విజయ సాయి రెడ్డిని కూడా విచారించాలని.సీబీఐ చీఫ్ నీ ప్రత్యేకంగా కోరడం జరిగింది.
ఎన్నో కేసుల్లో A2 ముద్దాయిగా విజయసాయి ఉన్నారని ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయసాయి ని పిలిచి విచారించాలని ప్రశ్నించాలని తెలిపారు.కొట్టాలి అనే పదం ఎలా బయటకు వచ్చింది అన్న కోణంలో విచారించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
ఏదిఏమైనా విజయసాయిరెడ్డిని జైలుకు పంపే అంతవరకు నిద్రపోయే ప్రసక్తిలేదని రఘురామకృష్ణరాజు సీరియస్ కామెంట్లు చేశారు.







