విజయవాడ: సిపిఐ రామకృష్ణ కామెంట్స్.3 రాజధానుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి నేడు ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు.
ఇప్పటికైనా చేసిన తప్పును గ్రహించి అమరావతినీ రాజధానిగా కొనసాగించాలని ఆయన సూచించారు.
న్యాయవ్యవస్థను కించపరిచే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.







