ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న భీకరమైన పోరు ప్రపంచ దేశాలను వణికేచేస్తుంది.ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిగాయి.
ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.మూడో దఫా చర్చలకు.
సిద్ధమవుతున్నారు.ఇటువంటి తరుణంలో రష్యా దాడులు వల్ల ఉక్రెయిన్ లో సామాన్య జనులు విలవిలలాడి పోతున్నారు.
ఇదిలా ఉంటే యుద్ధం ప్రారంభంలో.ఉక్రెయిన్ లో ఇతర దేశాలకు చెందిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం తెలిసిందే.
ఈ క్రమంలో మన దేశానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా అక్కడ మరణించటం జరిగింది.
ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులను తీసుకురావడంలో .కీలక నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే.సీఎం జగన్.
ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక నోడల్ అధికారులను కూడా నియమించారు.అంత మాత్రమే కాక కొంతమంది అధికారులను ఉక్రెయిన్ కి పంపించడం, ఇదే రీతిలో మరోపక్క కేంద్రంతో మంతనాలు జరపడం.
లెటర్లు రాయడం వంటివి చేసి ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు రావటం జరిగింది.కాగా నేడు ఉక్రెయిన్ నుండి ఏపీకి తరలివచ్చిన విద్యార్థుల బృందంతో.
జిల్లాకు ఒక విద్యార్థి చొప్పున సీఎం జగన్ కలవడానికి రెడీ అయ్యారు.సచివాలయంలో సీఎం చాంబర్ లో విద్యార్థులతో సీఎం జగన్ సమావేశం అవుతున్నట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.