మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖను ఆ మంత్రికి అప్పజెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటి మరియు పారిశ్రామిక శాఖలను చూసుకునేవారు.రాష్ట్రానికి పెట్టుబడులు మరియు పరిశ్రమలు అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను చాలా చురుకుగా గౌతమ్ రెడ్డి నిర్వహించేవారు.

 The Ap Government Handed Over The Mekapati Gautam Reddy Department To Buggana M-TeluguStop.com

ఆయన బతికున్న సమయంలో రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో మరియు పరిశ్రమల పెట్టు బడులు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించే వారు.అయితే ఇటీవల ఆయన గుండె పోటు రావడంతో మరణించడం తెలిసిందే.

సీఎం వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు మరియు చిన్ననాటి నుండి స్నేహితుడిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మరణం ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీ కి తీరని లోటు అని ఆ పార్టీ నేతలు సీఎం జగన్ కూడా చెప్పారు.ఇటువంటి తరుణంలో గౌతంరెడ్డి చూసుకునే శాఖలను తాజాగా ఏపీ ప్రభుత్వం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ప్రజెంట్ బుగ్గన రాజేంద్రనాథ్ ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ చూస్తుండగా ఇప్పుడు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

The AP Government Handed Over The Mekapati Gautam Reddy Department To Buggana Mekapati Gautam Red

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube