సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.ఇక సెలెబ్రిటీల గురించి అయితే రోజుకొక వార్త చూడవచ్చు.
కపుల్ విడిపోయారని, లవర్స్ బ్రేకప్ చెప్పుకున్నారని ఇలా ఉన్నవి లేనివి కల్పించి మరీ ప్రచారం చేస్తూ వారిని తీవ్రంగా హార్ట్ చేస్తూ ఉంటారు.నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియని కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు.
ఇదే సమస్య మెగా డాటర్ కు కూడా ఎదురైంది.
మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య దంపతులు పైన రకరకాల రూమర్స్ వచ్చాయి.
దీంతో ఈమె స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.ఈమె ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను క్లోజ్ చేసింది.
దీంతో ఈ విషయంపై మరిన్ని రూమర్స్ వచ్చాయి.ఈమె వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ఈ రూమర్స్ సారాంశం.
ఇది నిజం అబద్ధమా అనేది ఈమె స్పందిస్తే తప్ప తెలియదు.
తాజాగా ఈమె ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు తన భర్త చైతన్య తో కలిసి ఉన్న ఒక పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తమ పై వస్తున్న రూమర్స్ ను తగ్గించేందుకు ఈ ప్రయత్నం చేసిందని అనుకోవచ్చు.ప్రెసెంట్ వీరిద్దరి బంధం పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీయాలని నిహారిక కోరిక.
ఈమె నటిగా కొద్దిగా బ్రేక్ ఇచ్చిన నిర్మాతగా మాత్రం మారింది.పింక్ ఎలిఫెంట్ ఛానల్ పేరుతోనే ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి సినిమాని నిర్మిస్తుంది.సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ హీరోగా ‘ఒక చిన్న సినిమా కథ’ అనే సినిమాని రూపొందించింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 15 న జీ5లో రిలీజ్ అయ్యింది.ఈ చిన్న సినిమా ఓటిటి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.