ఈ కాలంలో చెప్పులు లేకుండా నడవడం సాధ్యం కాదు.ఎవరైనా చెప్పులు లేకుండా ఉండటాన్నిమనం ఊహించలేము.
అయితే మీకు నమ్మకం కలగకపోయినా మన దేశంలో ఒక గ్రామంలో పాదరక్షలు ధరించడాన్ని పూర్తిగా నిషేధించారు.ఇది వినగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ గ్రామం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉంది, ఇది తమిళనాడులోని మధురై నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.దాని పేరు కాళీమయన్ గ్రామం.
ఈ గ్రామానికి చెందినవారు తమ పిల్లలకు చెప్పులు, బూట్లు వేసుకోవడానికి కూడా అస్సలు అనుమతించరు.ఈ గ్రామంలో ఎవరైనా పొరపాటున బూట్లు లేదా చెప్పులు ధరించినట్లయితే, కఠినమైన శిక్ష విధిస్తారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ గ్రామంలోని ప్రజలు శతాబ్దాలుగా అపాచి అనే దేవతను ఆరాధిస్తున్నారు.వీరికి ఆ దేవతపై ఎంతో గౌరవం ఉంది.
అపాచి దేవత మాత్రమే తమను ఎల్లప్పుడూ రక్షిస్తారని వారు నమ్ముతారు.వారికి దేవతపై విశ్వాసం ఉన్నందున గ్రామ పరిధిలో పాదరక్షలు ధరించడం నిషేధించారు.
దీనికి గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
శతాబ్దాలుగా ఈ వింత సంప్రదాయాన్ని గ్రామస్తులు పూర్తి భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారనేది మాత్రం నిజం.
గ్రామానికి చెందినవారు ఎవరైనా బయటకు వెళ్లవలసి వస్తే, వారు తమ చేతితో బూట్లు లేదా చెప్పులు పట్టుకుని ఊరి సరిహద్దు దాటిన తర్వాత వాటిని ధరిస్తారు.తిరిగి వచ్చినప్పుడు, వారు గ్రామ సరిహద్దు దగ్గర బూట్లు, చెప్పులు తీసివేస్తారు.
ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోందన్న విషయం చాలామందికి తెలియదు.అయితే గ్రామ ప్రజలు ఎన్నో తరాలుగా ఆచారాన్ని పాటిస్తున్నారని ఇక్కడివారు చెబుతారు.
ఇక్కడ నివసించే పిల్లలు కూడా చెప్పులు లేకుండానే పాఠశాలకు వెళుతుంటారు.చెప్పుల పేరెత్తితే ఇక్కడి ప్రజలంతా కోపోద్రిక్తులవుతారు.
దేశంలో ఈ కాలంలోనూ ఇటువంటి ఇటువంటి సంప్రదాయాలను అనుసరించడం విచిత్రమే మరి.







