తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఇటీవలే గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇక హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు,కొట్లాటలతో రసవత్తరంగా సాగుతోంది.ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇద్దరు కంటెస్టెంట్ లపై డబుల్ మీనింగ్ డైలాగులు వదలడంతో కంటెస్టెంట్ లు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
అసలేం జరిగిందంటే.సరదాగా ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్ ఎంతో సందడి సందడిగా సాగింది.
గత వారం ఏకంగా 11 మంది కంటెస్టెంట్ నామినేట్ అవడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్ లను సేవ్ చేశాడు.ఈ నేపథ్యంలోనే వినూత్నంగా ప్లాన్లు కూడా చేశారు.
ఈ క్రమంలోనే సేవ్ చేయడానికి కావలసిన సామాగ్రిని తీసుకురావడం కోసం అఖిల్ సార్థక్, అషు రెడ్డి ని ఒక రూం లోకి పంపించాడు బిగ్ బాస్.అప్పుడు బిగ్ బాస్ హౌస్ నాగార్జున అఖిల్, అషు ని ఆటో రూమ్ లోకి పంపించే సమయంలో కేవలం స్టోర్ రూమ్ లో ఉన్న సామాన్లు మాత్రమే తీసుకొని రండి.
అక్కడ ఏమి చేయకండి అంటూ డబుల్ మీనింగ్ మాట్లాడడంతో.అప్పుడు అఖిల్ తల పట్టుకోగా.అషు మాత్రం ఇంకేం చేస్తాం సార్ అంటూ బదులిచ్చింది.

నాగార్జున అలా అనడంతో ఈ జంట పై పలు రకాల అనుమానాలు ప వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే 17 మంది కాంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈ సోలో ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, ఇక తాజాగా రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది.
కంటెస్టెంట్ ల మధ్య గొడవలు రోజురోజుకు తారస్థాయికి చేరుతున్నాయి.అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్ బాస్ రూల్స్ ని క్రాస్ చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు.అంతేకాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు గేమ్ ఆడుతున్నారు.







