రోగులకు మందులు, లేదా మాత్రలు ఇచ్చే పారదర్శకమైన బాటిల్స్ మూత వెనుక పత్తిని ఉంచడం కనిపిస్తుంది.ఇలా ఎందుకు చేస్తారోనని ఎప్పుడైనా ఆలోచించారా?.ముఖ్యంగా హోమియోపతి మందుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.సీసాలో మందు వేసిన తర్వాత, డాక్టర్ దానిలో కొంచెం కాటన్ ఉంచుతాడు.ఆ తరువాత మాత్రమే మూత బిగిస్తాడు.ఇలా ఎందుకు చేస్తార ఇప్పుడు తెలుసుకుందాం.
రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం ఈ విధానం 1900లో ప్రారంభమయ్యింది.తొలి ఫార్మా కంపెనీ బేయర్ ఈ పని ప్రారంభించిందని చెబుతారు.
కంపెనీ డెలివరీ చేసే మందు సీసాలలో కాటన్ బాల్ ఉంచేవారు.పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడంతో ఈ ట్రెండ్ను ఇతర కంపెనీలు కూడా అనుసరించాయి.
కంపెనీ ఇలా చేయడం వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది.మందులతో కూడిన సీసాలో పత్తిని ఉంచితే, ఆ మాత్రలు విరిగిపోయే అవకాశం తగ్గుతుందని కంపెనీ అభిప్రాయపడింది.
ఇంతేకాకుండా మోతాదు తగ్గకుండా అదే పరిమాణంలో ఉంటుంది.ఒక కస్టమర్ సీసాని తెరిస్తే, అతను ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.అందుకే అలా చేస్తారు.ఈ ట్రెండ్ ప్రారంభమైన తర్వాత 1980లో టాబ్లెట్ బయటి భాగంలో అలాంటి పొరను తయారు చేయడంతో పెనుమార్పు వచ్చింది.
తద్వారా మాత్రను సీసాలో ఉంచినప్పుడు అది పగిలిపోదు.ప్రపంచంలోని చాలా ప్రముఖ కంపెనీలు 1999 నుంచి ఇలా చేయడం మానేశాయి.
అయితే స్థానిక ఫార్మసీలు ఆల్కహాల్ ఉపయోగించని హోమియోపతి మందుల కోసం దూదిని ఉపయోగించడం కొనసాగించాయి.అయితే చాలా కాలంగా రోగులకు మందు బాటిళ్లలో దూదిని చూడటం అలవాటైపోయింది.
దీంతో పేషెంట్లు సీసాలలో కాటన్ పెట్టడం ప్రారంభించారు.ఈ కారణంగానే చాలా కంపెనీలు పత్తిని సీసాలో ఉంచే పద్ధతిని పునరుద్ధరించాయి.
ముఖ్యంగా హోమియోపతి మందుల విషయంలో ఇది నేటికీ కొనసాగుతోంది.







