దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.
రమణ ఒమిక్రన్ వైరస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఒమిక్రన్ వైరస్ సైలెంట్ కిల్లర్ అని పేర్కొన్నారు.
ఫస్ట్ వేవ్ కరోనా తో నాలుగు రోజులు మాత్రమే ఇబ్బందిపడటం జరిగిందని తెలిపారు.కానీ ఒమిక్రన్ వైరస్ తో గత 25 రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో ఒమిక్రన్ వైరస్ ప్రభావం తగ్గలేదని రోజుకి 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు.
కేసులు ఎప్పుడు భౌతిక విచారణ చేపట్టాలో మేం చెబుతాం అని అన్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా.పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ విచారణ పై స్పందిస్తూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఒమిక్రన్ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ అని సైలెంట్ కిల్లర్ అని.అందరూ జాగ్రత్తగా ఉండాలని మరోపక్క ప్రభుత్వాలు కూడా కరోనా ఆంక్షలు ఇంకా అమలు చేస్తూనే ఉన్నాయి.