నేను కోటీశ్వరుడిని కాదు రాజా రవీంద్రనే.. కోటి గెలుచుకున్న వ్యక్తి కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు ఈ షోలో కోటి రూపాయలు ఎవరు గెలుచుకోలేదు.

కానీ మొట్టమొదటిసారిగా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి రూపాయలను గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు సబ్ ఇన్స్పెక్టర్ బి రాజా రవీంద్ర. 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఎన్టీఆర్ చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కును అందుకున్నారు.

ఈ సీజన్ తో పాటుగా ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో హిస్టరీలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర సమాజం పట్ల బాధ్యత క్రైమ్ బ్రాంచ్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు.

తనకు వచ్చిన కోటి రూపాయలను కూడా సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తానని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు.కోటి గెలుచుకునే కోటీశ్వరుడిని అయినా నేను కోటీశ్వరుడు రవీంద్రగా ఫీల్ కావడం లేదు.

Advertisement

సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర గానే ఫీల్ అవుతున్నా అని తెలిపారు.

ఈ షోలో గెలిచినందుకు ఆనందంగానే ఉన్నప్పటికీ కోటీశ్వరుడు అనే టాబ్లెట్ నాకు నచ్చడం లేదు అని తెలిపారు.నన్ను ఇన్స్పెక్టర్ రవీంద్ర గానే పిలవండి అని చెప్పుకొచ్చారు.గత సీజన్స్ ని చూశాను కానీ వాటిపై నాకు పెద్దగా నమ్మకం కలగలేదు.

ఇది అసలు జెన్యూన్ షో నా? మనం వెళ్లగలుగుతామా? గెలుస్తామా అన్న సందేహాలు ఉండేవి.కానీ మా ఆవిడ వెళ్ళండి అని చెప్పడంతో క్వశ్చన్ కి ఆన్సర్ పంపించా.

ఆ తర్వాత కాల్ వచ్చింది ఎన్టిఆర్ ని డైరెక్టుగా చూసే అవకాశం దొరుకుతుందని వెళ్లానని తెలిపారు రాజా రవీంద్ర.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు