దీపావళికి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న 'పుష్ప' మేకర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా రెండు పార్టులుగా వస్తున్నా విషయం తెలిసిందే.మొదటి పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.కేవలం నవంబర్ నెల మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచి గ్యాప్ లేకుండా అప్డేట్ లు తీసుకు రాబోతున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక మాస్ లుక్ రివీల్ అయ్యింది.

ఇద్దరు కూడా మాస్ గా కనిపించి అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.ఇటీవలే శ్రీవల్లి పాట, సామీ సామీ పాటను రిలీజ్ చేయగా ఈ పాటలకు ఒక రేంజ్ లో స్పందన వచ్చింది.

Advertisement

ఎక్కడ చుసిన ఈ పాటలే వినిపిస్తూ హల్ చల్ చేస్తున్నాయి.అందరి అంచనాలను తలక్రిందులు చేసేలాగా ఈ పాటలు ఉండడంతో యూట్యూబ్ లో లైక్స్ మోత మోగిపోయింది.

ఇక ఇదే ఊపుతో దీపావళికి మరొక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సుకుమార్ టీమ్ సిద్ధం అవ్వబోతుందని తెలుస్తుంది.

నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట.మరి చూడాలి ఈ సినిమా టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు