రతి నిర్వేదం సినిమాలో నటించిన హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించిన రతి నిర్వేదం చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళ నటి శ్వేతా మీనన్ కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అయితే ఈ అమ్మడు చిత్రాలకి కేవలం మలయాళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా అభిమానులు ఉన్నారు.

అయితే ఒకప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మరియు బోల్డ్ తరహా చిత్రాల్లో నటించిన శ్వేతా మీనన్ ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా కొంత మేర జోరు తగ్గించింది.కాగా కాగా నటి శ్వేతా మీనన్ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది చదువు పూర్తయిన తరువాత సినిమాల పై మక్కువ కలగడంతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది ఆ తర్వాత కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పనిచేసింది.

ఈ క్రమంలో 1991వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన "అనస్వరం" అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది.ఆ తర్వాత పలు చిత్రాలలో రెండో హీరోయిన్ మరియు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన ఇప్పటికీ పెద్దగా కలిసి రాలేదు బోల్డ్ తరహా చిత్రాలు నటించడానికి సిద్ధపడింది.

దీంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా క్రేజ్ బాగా పెరిగిపోయింది.దీనికితోడు శ్వేతా మీనన్ అందాల ఆరబోతకు ఫిదా అయినటువంటి దర్శక నిర్మాత ఏకంగా లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.

Advertisement

అయితే అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో శ్వేతా మీనన్ బాలీవుడ్ సినీ పరిశ్రమలో మోడల్ గా పని చేస్తున్న "బాబీ భోంస్లే" అనే ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో 2011వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.ఆ తరువాత శ్వేతా మీనన్ మళ్లీ 2012 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రానికి చెందిన "శ్రీవలసన్ మీనన్" అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది.

కాగా ప్రస్తుతం వీరిద్దరికీ ఒక కూతురు ఉంది.ఆమె పేరు సబైనా మీనన్.అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి శ్వేతా మీనన్ అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తోంది.

కాగా ప్రస్తుతం శ్వేతా మీనన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం శ్వేతా మీనన్ మలయాళ భాషలో దాదాపుగా రెండు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది అయితే ఇందులో బ్లాక్ కాఫీ అనే చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

కాగా "బాదల్" అనే మరో మలయాళ సినిమా షూటింగ్ జరుగుతోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు